బాలయ్యతో పరశురామ్ సినిమా.. ఫ్యాన్స్‌కు పూనకాలే

by Disha Web Desk 7 |
బాలయ్యతో పరశురామ్ సినిమా.. ఫ్యాన్స్‌కు పూనకాలే
X

దిశ, సినిమా: యంగ్ హీరోలకు ధీటుగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహారెడ్డి' సినిమా చేస్తున్న ఆయన.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆయన ఖాతాలో మరో సినిమా చేరబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దర్శకుడే వెల్లడించాడు. అతనెవరో కాదు.. 'సర్కారు వారి పాట' సినిమా చేసిన పరశురామ్. ఆదివారం జ‌రిగిన 'ఊర్వశి వో రాక్షసివో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అథిదిగా బాల‌కృష్ణతో పాటుగా దర్శకుడు పరశురామ్ కూడా పాల్గోన్నాడు. ఇందులో భాగంగా పరశురామ్ మాట్లడుతూ 'ఓ అద్భుత‌మైన క‌థ‌తో త్వర‌లోనే బాల‌కృష్ణను క‌ల‌వ‌బోతున్నా' అని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read : మూడేళ్ల తర్వాత నా ఇంటికొస్తున్నా.. ప్రియాంక పోస్ట్ వైరల్

Next Story

Most Viewed